calender_icon.png 4 June, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఇనుగుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

02-06-2025 05:50:59 PM

హాజరుకానున్న సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డి, ఎంపీ రవిచంద్ర..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ మంగళవారం నిర్వహించనున్నారు. విగ్రహవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావుతో పాటు జిల్లా అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు హాజరవుతారని విగ్రహవిష్కరణ కమిటీ అధ్యక్షుడు పప్పుల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మాంకాళి రామ్ సలీం, కోశాధికారి గోపం దాస్ కృష్ణ తెలిపారు.

గతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ శిలా విగ్రహం దెబ్బతినడంతో కొత్తగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని తలచి ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకువెళ్లగా ఆరు లక్షల రూపాయల ఖర్చుతో రూపొందించిన కాంస్య విగ్రహాన్ని ఎంపీ తానే సమకూర్చారని నిర్వాహకులు తెలిపారు.