02-02-2026 12:23:27 AM
ప్రభుత్వ విప్ శ్రీనివాస్
వేములవాడ, ఫిబ్రవరి 1,(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర అవసరాలపై పలుమార్లు విన్నవించినప్పటికీ కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మూసీ అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఈ బడ్జెట్ కా ర్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉండి, సామాన్యులకు ప్రయోజనం లేకుండా ఉందన్నారు.
బయో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ముందున్న తెలంగాణకు ప్రస్తావన లేకపోవడం, క్రీడారంగానికీ నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు.తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.