23 June, 2026 | 10:49 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

చెంఘీజ్‌ఖాన్‌తో టెలిగ్రామ్ సీఈవో పోటీ

01-08-2024 08:30 AM

100 మంది పిల్లల ప్రకటనపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సరదా పోస్ట్

న్యూఢిల్లీ, జూలై 31: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తనకు పెళ్లికాకుండానే ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తండ్రినయ్యాయని వెల్లడించిన విషయం తెలిసిందే. వీర్యాన్ని దానం చేసి 100 మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించానని దురోవ్ తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా తాజాగా వెల్లడించాడు. కాగా, దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. 1000 మందికి పైగా పిల్లలు ఉన్న ఓ మనిషితో దురోవ్ పోటీపడుతున్నారని పోస్ట్ చేశారు. కచ్చితమైన సంఖ్య తెలియదు కానీ మంగోలియన్ యోధుడు చెంఘీజ్‌ఖాన్‌కు చాలామంది పిల్లలు ఉన్నారని, ఆయన సరసన చేరేందుకు దురోవ్ కృషి చేస్తున్నారని సరదాగా పోస్ట్ చేశారు.