న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కిర్గిజిస్థాన్లో మెడిసిన్ చదువుతున్న ఓ తెలుగు విద్యార్థి గడ్డకట్టిన జలపాతంలో కూరుకుపోయి మృతిచెం దాడు. ఆదివారం ఈ ఘటన జరుగగా మంగళవారం వెలుగు చూ సింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగలకు చెందిన దాసరి చందు (20) కిర్గిజిస్థాన్లో మెడిసిన్ రెండో సంవ త్సరం చదువుతున్నాడు.
శనివారంతో పరీక్షలు ముగియడంతో చందు ఆదివారం నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు జలపాతం వద్ద కు వెళ్లాడు. అక్కడ శీతోష్ణస్థితి అతి తక్కువ ఉండడంతో చందు గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకు పోయి ప్రాణాలు వదిలాడు. మిగిలిన స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డారు. సమా చారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెంటనే స్పందించారు. యువకుడి మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.