23-02-2026 12:59:33 AM
బోధన్, ఫిబ్రవరి 22(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ కోట మైసమ్మ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో మల్లారం స్వామి కృష్ణ మనోజ్ ఆధ్వర్యంలో మహా యజ్ఞం నిర్వహించి, ప్రవచనం చేశారు. ఆలయం వద్దకు భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజ్, గుంత గంగాధర్, గౌతమ్ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.