15 March, 2026 | 5:17 PM

Breaking News

రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •   అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత   •   రజాకార్లను తరిమికొట్టిన వీరుడు కామ్రేడ్ బీఎన్ రెడ్డి   •  

బదిలీలపై ఉద్యోగుల్లో టెన్షన్!

11-07-2024 12:39 AM

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): విద్యాశాఖలో ఉద్యోగులకు బదిలీల టెన్షన్ పట్టుకుంది. గత కొన్నేళ్లుగా ఆయా శాఖల్లో తిష్టవేసి కూర్చున్న ఉద్యోగులు బదిలీల అంశంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరిగిన విషయం తెలిసిందే. ఇక సాధారణ బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, సాంకేతిక విద్యాశాఖతోపాటు ఇతర శాఖల్లోని కమిషనరేట్ పరిధిలో ఉండే ఉద్యోగులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈక్రమంలోనే బదిలీ అయి ఎక్కడికి వెళ్తామో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.