15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

25-11-2025 02:28 PM

హైదరాబాద్: ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సామినేని రామారావు(Samineni Rama Rao) హత్యకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడించారు. నిరసనల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) పాల్గొన్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సీపీఎం మధ్య లోపులాట జరిగింది. సామినేని రామారావు  హ‌త్య ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉప ముఖ్యముఖ్యమత్రి భ‌ట్టి విక్రమార్క ఇలాకాలో హ‌త్యా రాజ‌కీయం భ‌గ్గుమ‌ంది. దుండ‌గులు క‌త్తుల‌తో  సామినేని రామారావు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. సామినేని రామారావును కాంగ్రెస్ నేత‌లే హత్య చేయించారని సీపీఎం నేత‌లు అనుమానం వ్యక్తం చేశారు.