18-06-2025 10:19:13 AM
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రసంగించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పవాల్గాం ఉగ్ర దాడి(Pahalgam Terror Attack).. మానవత్వంపై జరిగిన దాడి అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ, ఈ సంఘటనను భారతదేశంపై, మానవాళిపైనే జరిగిన తీవ్రమైన దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే అన్ని దేశాలకు వ్యతిరేకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ(Narendra Modi) అన్నారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, ప్రపంచం తన విధానంలో స్పష్టంగా ఉండాలని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే.. మరోపైపు మద్దతు ఇస్తున్నాయని ప్రధాని ఆరోపించారు."దురదృష్టవశాత్తు, గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయి. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థికానికి సంబంధించిన సంక్షోభాల వల్ల ముందుగా దెబ్బతినేవి వారే. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలు, ఆందోళనలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం భారతదేశం తన బాధ్యతగా భావిస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
దౌత్యవేత్తల పునర్నియామకానికి భారత్, కెనడా అంగీకారం
దౌత్యవేత్తల పునర్నియామకానికి భారత్, కెనడా అంగీకారం తెలిపాయి. జీ 7 సదస్సులో భాగంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ, మార్క్ కార్నీ చర్చల్లో దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం వచ్చింది. కెనడా గత ప్రధాని ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ట్రూడో హయాంలో ఇరుదేశాల రాయబారులను భారత్, కెనడా వెనక్కి పిలిచాయి. తాజా నిర్ణయంతో భారత్-కెనడా సంబంధాలు బలోపేతమయ్యే అవకాశముంది.