30-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పహ ల్గామ్ ఘటన జరిగిందని, అటువంటి చర్య లు మళ్లీ జరగకుండా దుండగులను కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆ ధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరస న వ్యక్తం చేశారు.
ఈ సంద ర్భంగా మండల సిపిఎం కార్యదర్శి గొడిశాల వెంకన్న మాట్లా డుతూ పెహల్గామ్ ఘటనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిం చాలని, మతోన్మా దాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని డిమాండ్ చేశారు.
ఉగ్రదాడులకు బలైన పహల్గాం మృతులకు నివాళులర్పిం చారు. ఆ పార్టీ నాయకులు బొబ్బల యాకూబ్ రెడ్డి, చాగం టి కిషన్, సావిత్ర, వెంకన్న, నిరూటీ జలంధ ర్, ఎల్లయ్య, జల్లే జయరాజు పాల్గొన్నారు.