7 May, 2026 | 2:05 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

విద్యాసంస్థల్లో సీట్లు తెలంగాణకే పరిమితం చేయాలి

23-06-2024 10:36 PM

హైదరాబాద్: విద్యాసంస్థల్లోని సీట్లు తెలంగాణకే పరిమితం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2తో కాలం చెల్లిందని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన తెలిపారు. విభజన చట్టం పదో షెడ్యూల్‌లో ఉన్న విద్యాసంస్థలు.. తెలుగు, డా.బీఆర్ అంబేద్కర్ వంటి విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు  తెలంగాణ వారికే పరిమితం చేయాలని తెలిపారు. దీనికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ సీఎంఓ, సీఎస్‌కు ట్వీట్‌ను ఆయన ట్యాగ్ చేశారు.