13-06-2025 12:46:07 AM
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయపడ్డట్టు అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జీఎస్ మా లిక్ పేర్కొన్నారు. బ్రిటీష్ జాతీయుడైన విశ్వాస్ ఫ్లుటైలో 11ఏ నంబర్ సీటులో కూర్చున్నాడు. రమేశ్ విశ్వాస్ కుమార్ ప్రమాదం అనంతరం స్వల్ప గాయాలతో నడుచుకుంటూ బయటకు వచ్చారని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ను సివిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జనావాస ప్రాంతాల్లో విమానం కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అందించనున్నట్టు గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. ‘విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే భారీ శబ్ధంతో కూలిపోయింది. కండ్లు మూసి తెరిచే సరికి విమాన ప్రమాదం సంభవించింది.’ అని విశ్వాస్ తెలిపారు.