13-06-2025 01:07:25 AM
ప్రపంచంలో ఘోర విమాన ప్రమాదాలు..
కేవలం మన దేశంలో అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో వందల్లో అమాయక ప్రయాణికులు మరణించగా.. వేల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలారు. ఏ ఒక్క విమాన సంస్థ అని కాకుండా అన్ని సంస్థల విమానాలకూ ప్రమాదాలు సంభవించాయి.
దేశంలో జరిగిన విమాన ప్రమాదాలు
ఎన్నో సంవత్సరాల నుంచి భారత్లో అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో వందల మంది మృతి చెందగా.. వేల మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. 1990 నుంచి ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాలను పరిశీలిస్తే..
తప్పెక్కడ జరిగింది?
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఊహాలకందని మహా విషాదం జరిగిపోయింది. రన్ వే నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ నిమిషాల వ్యవధిలోనే కూలిపోయింది. విమానం సరైన దిశలో పైకి ఎగురుతున్నపుడు ల్యాండింగ్ గేర్ను తిరిగి యధాస్థితికి మారుస్తారు.
కానీ మనకు కనిపిస్తున్న దృశ్యాల్లో ల్యాండింగ్ గేర్ను పైలట్ మరోసారి ఎక్స్టెండ్ చేసినట్లు ఉంది. దీని వల్ల పవర్ అనేది కోల్పోతుంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పవర్ ఫెయిల్యూర్తో సఫర్ అయింది. ఇది ఒక కారణం కాగా.. మరో పాజిబుల్ సినారియో ఏంటంటే.. ల్యాండింగ్ గేర్ అనేది మధ్యలోనే జామ్ అయి ఉంటుంది. మెకానికల్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ వల్ల ఇది సంభవిస్తుంది.
ఇటువంటి సందర్భాల్లో పైలట్లు మరింత బలంగా గేర్ను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి సమస్య తలెత్తినపుడు విమానం పైకి ఎగరడంలో సమస్య ఏర్పడుతుంది. తక్కువ వేగంతో ఉన్నపుడు, తక్కువ ఎత్తులో ఉన్నపుడు ఇలా అవడం చాలా ప్రమాదకరం.
ఇది విమానం ఎగిరే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. విమానం కూలిపోవడానికి ఇవే కారణాలు కావొచ్చు. అని పలువురు పైలట్లు అభిప్రాయపడుతున్నారు. డీజీసీఏ విచారణలో భాగంగా అమెరికా నుంచి బోయింగ్ అధికారులు ప్రమాదాన్ని పరిశీలించేందుకు భారత్ కు రానున్నారు.
విమాన ప్రమాదానికి కారణమదేనా?
విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఒక కారణమైతే పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా 171 విమానం కొన్ని క్షణాలకే కుప్పకూలింది. అందుకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
దీనివల్ల ప్రమాదం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పైలట్ సౌరభ్ భట్నాగర్ మాట్లాడుతూ.. ఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం రెండు ఇంజిన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చని ప్రాథమికంగా కనిపిస్తోందన్నారు.
టేకాఫ్ సరిగా కాలేదని, పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్టు ఫుటేజీలో కనిపించింది. పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఇంజన్ శక్తి కోల్పోవడం లేదా విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భంలోనే ఇలా జరుగుతుందన్నారు. ఏది ఏమైనా దర్యాప్తులోనే కచ్చితమైన కారణం తేలే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
కీలకంగా మారనున్న బ్లాక్ బాక్స్
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. టేకాఫ్ అ యిన ఐదు నిమిషాల వ్యవధిలోనే సాంకేతిక లోపంతో చెట్టును ఢీకొని కుప్పకూలింది. అ యితే విమానంలోని బ్లాక్ బాక్స్ ప్రమాదానికి సంబంధించిన కారణాలను వెలుగులోకి తీసుకురానుంది. ఇక బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలెట్ల మధ్య సంభాషణలను రికా ర్డు చేసే పరికరం.
ఫ్లుటై డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్ గా పరిగణిస్తారు. ఫ్లుటై డేటా రికార్డర్ ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లుటై పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పారామీటర్స్ను నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైల ట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలను సేకరిస్తుంది. బ్లాక్ బాక్స్లు అత్యం త ధృడంగా ఉంటాయి. ఎంతటి ప్రమాదమైన తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. నారింజ కలర్లో మెరుస్తూ ఉంటే బ్లాక్స్ బాక్స్ 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
భర్త కోసం బయల్దేరి.. తిరిగిరాని లోకాలకు
విమాన ప్రమాదంలో నవవధువు మృతి!
ఘోర విమాన ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందింది. భర్తను కలిసేందుకు లండన్కు బయల్దేరిన ఆమె ఈ ప్రమాదంలో మరణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె జాడ తెలియక కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజస్థాన్లోని బలాతోరా జిల్లా అర్బాకు చెందిన ఖుష్బూ అనే మహిళకు మన్ఫూల్ సింగ్ అనే వ్యక్తితో జనవరిలో వివాహం అయింది. మన్ఫూల్ లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అతడు అక్కడికి వెళ్లాక తొలిసారి భర్తను కలిసేందుకు ఖుష్బూ బయల్దేరింది. ఆమె వెళ్తున్న విమానం ప్రమాదానికి గురవడంతో ఆమె మరణించే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
30 సెకన్ల పాటు పెద్ద శబ్దం: విశ్వాస్
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్. సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విశ్వాస్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత విమానం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది.
ఈ దశలో విమానంలోని ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి దూకేందుకు ప్రయత్నించా. మొదట డోర్ ఓపెన్ కానప్పటికీ ఆ తర్వాత బలంగా గుద్దడంతో డోర్ ఓపెన్ అయి విమానం పేలడానికి ఒక్క నిమిషం ముందు బయటకి దూకేశాను. ఘటన జరిగిన తర్వాత చాలా సేపటికి మెళుకువ రావడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాను’ అని చెప్పుకొచ్చాడు.
కొలువుకని వెళ్తుంటే..
లండన్లో ఉన్నత కొలువు కోసమని వెళ్తూ.. ఓ కుటుంబం విమానప్రమాదంలో దుర్మరణం చెందింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ ప్రతీక్ జోషి లండన్లో స్థిరపడేందుకు బయల్దేరారు. డాక్టర్ ప్రతీక్ జోషితో పాటు ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.