13-06-2025 12:19:11 AM
న్యూఢిల్లీ, జూన్ 12: భారత్లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మా జీ ప్రధాని షేక్ హసీనా, ఢిల్లీ నుంచి సోషల్ మీడియా వేదికగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ విషయమై తాను భారత ప్రధాని నరేంద్రమోదీతో చర్చించానని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ ప్రోగ్రామ్లో మాట్లాడుతూ.. హసీనాను కట్టడి చేయాలని కోర గా.. దానికి మోదీ అంగీకరించలేదని చెప్పా రు.
కొన్ని నెలల క్రితం జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ఈ ఇద్దరు నేతలు భేటీ కాగా.. భారత ప్రధాని మోదీతో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ‘బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా హసీనా ఆన్లైన్లో ప్రసంగా లు చేస్తున్నారు. దానివల్ల మా దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించడం మీ విధానపరమైన నిర్ణయం.
ఆ విషయంలో నేనేం మాట్లాడను. కానీ హసీనా ఆన్లైన్ వేదికగా చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలను ఆపండి’ అని మోదీని కోరినట్టు యూనస్ తెలిపారు. ఇందుకు మోదీ బదులిస్తూ.. ఇది సోషల్ మీడియా అని, దాన్ని నియంత్రించడం సాధ్యంకాదని సమాధానం చెప్పిపట్టు యూనస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము భారత్తో బలమైన సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
నకిలీ వార్తల కారణంగా ఇరుదేశాల మధ్య స్నేహపూరిత వాతావరణానికి గండి పడుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగుండగా, తాత్కాలిక ప్రభుత్వాధినేత దానిపై కూడా స్పందించా డు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగం కావాలనే ఉద్దేశం, ఆసక్తి తనకు లేవని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు.