21 March, 2026 | 5:19 AM

చెవి కొరికేసాడు

21-03-2026 01:58 AM

గొడవలో తల దూర్చాడని ఆగ్రహానికి గురైన వ్యక్తి చర్య

మహబూబాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): గొడవలో తల దూర్చాడని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి.. బాధిత వ్యక్తి చెవి కొరికిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూరు మండలం అవుతాపురంలో జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన జోగు సతీష్ అనే వ్యక్తి అవుతాపురం గ్రామానికి చెందిన ముగ్గురితో గొడవ పడుతున్నాడు. అదే గ్రామానికి చెందిన బందు శశి కుమార్, గద్దల రోహిత్, చెడుపాక సాంబశివ అనే ముగ్గురు అక్కడికి వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు.

దీనికి ఆగ్రహించిన సతీష్.. బందు శశి కుమార్ చెవిని నోటితో గట్టిగా కొరకడంతో చెవి భాగం కొంత ఊడి పడిపోయింది. గాయపడ్డ శశికుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు వెంకన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా పెద్ద వంగర ఎస్సు చిలువేరి ప్రమోద్ కుమార్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు దర్యాప్తు చేపట్టారు.