12-10-2025 08:33:05 PM
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
వేములవాడ (విజయక్రాంతి): ఈ నెల 19వ తేదీన ఆదివారం శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధుశేఖర భారతి స్వామి వారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి రానున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. శృంగేరి పీఠాధిపతి రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వేములవాడలోని రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్, ఎస్పీ మహేష్ బి గితే, దేవదాయ శాఖ సలహాదారు గోవింద హరి, ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆదివారం సమీక్షించారు. ఆలయ స్థానాచార్యులు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం అయ్యారు. పీఠాధిపతి రానున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.