18-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రైతులకు రైతు భరోసాతో ఆదుకున్న సీఎం రేవంత్రెడ్డి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్ అయ్యారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటీ వరకు చరణ్సింగ్ను ఛాంపియన్ ఆఫ్ది ఫార్మర్ అంటారని తెలిపారు.
కేవలంల 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడమంటే సాహసోపేతమైన నిర్ణయమని, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చర్యలన్నారు. గత ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ కూడా సరిగా చేయలేదని, కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. కేసీఆర్ రైతులకు బేడీలు వేస్తే.. రేవంత్రెడ్డి రైతులకు అండగా ఉంటున్నారని తెలిపారు.