30-06-2025 12:00:00 AM
అసిఫాబాద్ లో జర్నలిస్టుల నిరసన, ర్యాలీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్29( విజయక్రాంతి): మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి చేయడం మీడియా స్వేచ్ఛ హరించడమే అని కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాం నాయక్ , టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అద్యక్షుడు అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే( హెచ్ 143) జిల్లా కన్వీనర్ రావి నాయక్ అన్నారు. మహా న్యూస్ కార్యాలయం పై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబే ద్కర్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు.
అంతకముందు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా ఛానల్ కథనాలపై అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలి గాని భావ స్వేచ్ఛ కు భంగం కలిగించినట్లు మీడియా సంస్థల కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మహా టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను గుర్తించి వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఆందోళనాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి ల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , జర్నలిస్టులు రవి, రాజ్ కుమార్ , ఖలీల్, వెంకటేష్ , అవినాష్ , సదశివ్, భీమ్రావు , రాందాస్, శ్రీను , శ్రీధర్, మినేష్, సోజర్ , ముబాషిర్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
జర్నలిస్టు స్వేచ్ఛ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాం నాయక్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అద్యక్షుడు అబ్దు ల్ రహమాన్, టీయూడబ్ల్యూజే( హెచ్ 143) జిల్లా కన్వీనర్ రావి నాయక్ డిమాండ్ చేశా రు. శనివారం జిల్లా కేంద్రంలో మృతికి సం తాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌ నం పాటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టు స్వేచ్ఛ సామాజిక సేవలు ముందుంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని , ఆమె సేవలు చిరస్మరణీయమ న్నారు. ఆమె మరణం పై పారదర్శకంగా దర్యాప్తు చేసి మృతికి కారకులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.