30-06-2025 12:00:00 AM
ఆదిలాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాథోడ్ రమేష్ ఓ వ్యక్తి కాదని, ఓ శక్తి అని, దమ్మున్న లీడర్ గా తన రాజకీయాలను కొనసాగించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉట్నూర్ లో ఆదివారం నిర్వహించిన మాజీ ఎంపీ స్వర్గీయ రాథోడ్ రమేష్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, అనిల్ జాదవ్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ లోని స్మారక స్మృతివనం లో ఏర్పాటు చేసిన రాథోడ్ రమేష్ విగ్రహాన్ని ఆయన కుమారుడు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తో కలిసి ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఆది లాబాద్ జిల్లా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. బంజారా సమాజంలో రాథోడ్ రమేష్ టైగర్ గా పేరు పొం దారని గుర్తు చేశారు.
రాథోడ్ రమేష్ ఎన్నో రాష్ట్రాల్లో మంచి లీడర్ గా పేరు సంపాదించారని అన్నారు. రాథోడ్ రమేష్ ని ఆద ర్శంగా తీసుకునే ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ సతీమణి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఆయా పార్టీల నాయకులు అయ్యన్న గారి భూమయ్య, సువాసిని రెడ్డి, సుగుణ, గోక గణేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.