calender_icon.png 30 June, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

30-06-2025 12:00:00 AM

  1. జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు
  2. ముగ్గురికి తీవ్ర గాయాలు, 25 మందికి స్వల్ప గాయాలు
  3. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

అదిలాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి) :  ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా,  25 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరా బాదు నుండి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున గుడిహత్నూర్  మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నుండి అదుపు తప్పి 20 అడుగులకింద ఉన్న సర్వీసు రోడ్డుపై బోల్తాపడింది.

ఈ ప్ర మాదంలో ఆనంద్ అగర్వాల్, ఇర్ఫాన్ మ న్సూరీ, గడుగు నరేందర్ లకు తీవ్ర గాయా లు కాగా, 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఐదు 108 అంబులెన్స్ ల్లో క్షతగా త్రులను ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.