calender_icon.png 9 February, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారంలో చేగుంట ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్‌లు

09-02-2026 12:09:56 AM

చేగుంట ఫిబ్రవరి 8,.దుబ్బాక లో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇం చార్జ్ సి, హెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అ ధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడడం తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

కెసిఆర్ ఇంట్లో దోచుకున్న డబ్బుల వాటాల విషయంలో పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. ఇ ప్పటికైనా మున్సిపాలిటీలోని ఓటర్లు ఆలోచించి బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల అభ్యర్థులకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు వడ్ల నవీన్ కుమార్,చైర్మన్ వెంగల్ రా వు, డైరెక్టర్ లు మెహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, ఆంజనేయులు, బల్ రె డ్డి, ఫకీర్ నాయక్, వినోద్, నాయకులు అ యిత పరంజ్యోతి, చౌదరి శ్రీనివాస్,బోల ప్ర శాంత్,కన్యారం సతీష్, ఎర్రం రవీందర్, సిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు.