సీఎం సభను జయప్రదం చేయాలి

22-04-2024 12:03:08 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): మడికొండలో ఈనెల 24న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సభకు ప్రతి డివిజన్ నుంచి 1000 మంది వచ్చేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని.. వరంగల్ ఎంపీగా కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ వంటి మతతత్వ పార్టీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు కూచన రవళి, నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు.