calender_icon.png 28 June, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్..

12-06-2025 10:27:28 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj).. అనంతరం పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు బుక్కులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని కోట్ల రూపాయలు వెచ్చించి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం అన్ని రకాల వసతులను పాఠశాలలో కల్పిస్తుంది అన్నారు.

తల్లిదండ్రులు శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలన్నారు, ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను కైవసం చేసుకోవాలని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారన్నారు, మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు, తదనంతరం రంగాయిపల్లిలోని ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సుల సమస్యలను పరిశీలించారు ఇందులో పాల్గొని అధికారులు ఉన్నారు.