20 July, 2026 | 5:39 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

పట్టణ పేదలకు సొంతింటి కల నిజం..

20-07-2026 12:00 AM

నేడు ‘ఇందిరమ్మ ఇళ్లు.. ఎస్‌ఐజీ హౌసింగ్ టవర్స్’ షురూ

రంగారెడ్డి, జులై (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు పట్టణాల్లోని నిరుపేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసేందుకు సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల కోసం ’ఇందిరమ్మ ఇళ్లు  ఎస్‌ఐజీ  హౌసింగ్ టవర్స్’ పథకాన్ని ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్  పరిధిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. నగరాలు, పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాల  జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా, అన్ని ఆధునిక వసతులతో కూడిన అపార్ట్మెంట్ తరహా బహుళ అంతస్తుల గృహాలను (హౌసింగ్ టవర్స్ ) ప్రభుత్వం నిర్మించనుంది.

ఆధునిక గృహ సముదాయాలు.. 

మురికివాడలు, ఇరుకు అద్దె ఇళ్లలో నివసిస్తున్న పట్టణ పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అన్ని సౌకర్యాలతో కూ డిన ఫ్లాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన అసలైన పేదలకే ఈ ఇళ్లు దక్కేలా పూర్తి పారదర్శక విధానాన్ని అవలంబించనున్నారు.

నేడు మార్గదర్శకాల విడుదల..

ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, వార్షిక ఆదాయ పరిమితి తదితర పూర్తి స్థాయి విధివిధానాలను ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించనుంది. పట్టణాల్లో అద్దె భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు దీంతో పెద్ద ఉపశమనం కలిగించనుంది. వెలువడనున్న అధికారిక మార్గదర్శకాల అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.