30-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): ఏడాదికోసారి.. అది కూడా మే నెలలో.. మొక్కకు ఒక్కటే పూసే ‘మే’ పుష్పం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బండి శోభారాణి ఇంటి ఆవరణలో విరబూసింది. అరుదుగా కనిపించే లిల్లీ జాతికి చెందిన ఈ మొక్కకు పూబంతిని తలపించే విధంగా పూసిన పుష్పం ముగ్ధ మనోహరంగా మారింది.