14-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అంతం, వరంగల్ రజతోత్సవ సభతోనే మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తానెక్కడా డలేదన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో హైదరాబాద్లో కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం వంటి లక్షణాలున్న రేవంత్ సర్కార్తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్య లు, రైతు ఆత్మహత్యలపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, అకా ల వర్షాలతో నష్టపోయిన రై తులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యచరణ ఉండబోతుందని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులకిచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు ఇవ్వడం, ఇటీవల వెలుగు చూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై ప్రజా ఉద్యమాలను చేపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కార్యకర్తలందరికీ అభినందనలు
రాష్ర్ట చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎల్కతుర్తి మీటింగ్ నిలిచిపోతుందన్న కేటీఆర్, ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్తకు, నేతకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ సభ తర్వాత రాష్ర్ట రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
సభ తర్వాత ప్రజలు, కార్యకర్తల్లోనూ ఆశావాహ దృక్పథం పెరిగిందన్నారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. రజతోత్సవ సభ నిర్వహించే అవకాశం, వరంగల్కు ఇచ్చినందుకు పార్టీ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.