calender_icon.png 28 June, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నభూతో నభవిష్యత్!

28-06-2025 12:00:00 AM

- ఆ సారుకు తిట్ల దండకం వెన్నతో పెట్టిన విద్య 

- ఆయనతో వేగలేమంటున్న సహోపాధ్యాయులు, విద్యార్థులు

‘విద్యా వినయేన శోభతే‘ వినయంతో విద్యను అందించాల్సిన గురువులు, విన యం లేక సహనం కోల్పోయిన గురువు ‘నభూతో నభవిష్యత్ ‘అన్న చందంగా తిట్ల దండకం, బూతులదండకం, క్రౌర్యం దూష ణనే ఆభరణంగా చేసుకున్న ఓ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడి వీరంగం చూసి, బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు, భీతిల్లుతున్న విధాయార్థులు. అతనికోపం సహ ఉపాధ్యాయుడితో రాళ్లు రువ్వుకుని, చెప్పులతో దాడిదాకా వచ్చింది. 

పెబ్బేరు జూన్ 27 : సవ్యంగా ఉండి వి ద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చాల్సిన ఉపాధ్యాయులు గొడవపడి జిల్లా వి ద్యాశాఖ అధికారి వద్దకు చేరుకున్న పంచాయతీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెబ్బేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా గత రెండు సంవత్సరా లుగా విధులు నిర్వహిస్తున్న విష్ణు వర్ధన్ రావు అష్టాదశ వక్ర భాషతో యధేచ్చగా బూతులదండకం వల్లిస్తున్నాడని, అటు వి ధ్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు తీవ్ర మా నసిక వేధనకు గురౌతున్నట్లు తెలిసింది.

ఇటీవల పాఠశాల లో పనిచేస్తున్న ఇంద్రారావు అనే ఉపాధ్యాయున్ని నూతన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం అప్పగించారు. గత మంగళవారం రోజు పుస్తకాలు పంపిణీ చేస్తుండగా ప్రధాన ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని విధ్యార్థుల ముందే ఇక్కడ ఏం.. పీ.. తున్నావ్ అని ఇక్కడ నుంచి దెం.... య్ అంటూ దుర్భాషలాడటం తో ఇరువురి మ ద్య గొడవ రాజుకుంది. అది కాస్తా విద్యార్థులముందే రాళ్లు రువ్వుకుని చెప్పులతో కుస్తీ పట్టే వరకు వచ్చింది.

ఇట్టి విషయం పై అహం దెబ్బ తిన్న ప్రధానోపాధ్యాయుడు, ఇంద్రారావు కు మెమో జారీ చేశారు. అట్టి మెమో తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర తనతో పాటు, పాఠశాల లో నిత్యం వే ధింపులు, ఆయన బూతుపురాణంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇ వ్వాలని ఎంఈవో జయరాములు కు అప్పగించారు.

గురువారం విచారణ లో భాగం గా మొదట విధ్యార్థులతో ఎంఈవో మా ట్లాడి ఒక నివేదిక తయారు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. నలుగురు ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నందున వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారి కి నివేదిక ఇస్తానని ఆయన తెలిపారు. 

స్థానికుల్లో ఆందోళన.,.

అసలే ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తో విద్యార్థులు కరువై పాఠశాలలు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి లో ఉపాధ్యాయ వైఖరి ఈ రకంగా ఉండటం స్తానికుల్లో ఆందోళన నెలకొంది. వీరి అనూహ్య ప్రవర్తన రేపు విధ్యార్థులపై ప్రభా వం చూపితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అని విధ్యార్థులత ల్లిధండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఇలాంటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి కొత్త ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నాను. 

ఉద్దేశ్యపూర్వకంగా అభాండాలు మోపుతున్నారు

ఉద్దేశ్యపూర్వకంగా అభాండాలు మోపుతున్నారు. విధులకు సరిగ్గా హాజరు కాని, నిర్వర్థించలేని వారిని మందలించటం తప్పు కాదని నా అభిప్రాయం. ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను. 

విష్ణు వర్ధన్ రావు, పెబ్బేరు ప్రధానోపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం...

పాఠశాలలో వి ధ్యార్థుల ముందు ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించిన తీరు హేయమైన చర్య. దీనిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంఈవో జయరాములు తన స్థాయి మరిచి దిగజారి బూతులు మాట్లాడుతాడు

ఒక వ్యక్తి ఏరకంగా ఆత్మస్థైర్యా న్ని కోల్పోతాడో అన్నిరకాలుగా ప్రధానోపాధ్యాయులు విష్ణు వర్ద న్ రావు బాగా తెలుసు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కోసారి ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాంరా నాయనా అనిపిస్తుంది. తన స్థాయి మరిచి దిగజారి బూతులు మాట్లాడుతాడు. అందుకే గొడవ పెద్దది గా మారింది. 

 ఇంద్రారావు ఉపాధ్యాయుడు