27-06-2025 11:51:47 PM
రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ: అక్టోబర్ నాటికి ఎత్తిపోతల పథకం పూర్తి చసి అందుబాటులోకి తీసుకుని రావాలి అని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ మండలం రెడ్ల కుంట గ్రామంలో నిర్మించే రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను జిల్లా కలెక్టర్ తేజస్ల్ నందలా పవర్ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కువ మిషనరీ మనుషులను ఏర్పాటు చేసుకొని పనులను త్వరగా పూర్తి చేయాలి అని ఇరిగేషన్ అధికారులనీ కాంట్రాక్టర్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సి రమేష్ బాబు, డి ఈ శివధర్మతేజ్, సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఎస్ ఈ సీతారామయ, డిఈ రమేష్, దేవాలయ చైర్మన్ సాదినేని అప్పారావు, నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.