17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

దోమల నివారణే లక్ష్యం

26-04-2025 12:20 AM

మలేరియా దినోత్సవం సందర్భంగా ఆశ వర్కర్ల ర్యాలీ 

నిజామాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): దోమల నివారణకు అందరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం  జిల్లా స్థాయి ప్రచార ర్యాలీని నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీ అనంతరం ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధుల నివారణకు ఆరోగ్య కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి రక్త నమోనాలు సేకరించి, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స ఇవ్వాలని కోరారు. 

కార్యక్రమంలో జిల్లా కీటక జనీత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం, వైద్యాధికారులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుసేన, డాక్టర్ శిఖరా, డాక్టర్ చంద్రకళ, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా అధికారి మహమ్మద్ సలీం, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.