calender_icon.png 20 February, 2026 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

20-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

మెదక్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి) : గిరిజనులకు,లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ జయతి కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలకు, గిరిజనులకు, లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, మెదక్ నియోజకవర్గంలోని తండాల్లోని వివిధ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసి అబివృద్ధి పనులు చేశామన్నారు.

మరింత గిరిజనుల, లంబడాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. లంబాడా వేషధారణలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, కల్కి మహరాజ్, భిక్షూ మహరాజ్, కౌన్సిలర్ సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్, దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.