calender_icon.png 23 June, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెలకు రవాణా సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం

20-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి,జూన్ 19:రాష్ట్రం లోని మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం ప్రతి పల్లెకు రావాణా సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి నుండి తలకొండపల్లి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాని మండల ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.మండల ప్రజల కోరికమేరకు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడారు.స్పందించిన డిపో మేనేజర్ బస్సు ఏర్పాటు చేశారు.

కల్వకుర్తి నుండి తలకొండపల్లి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం కల్వకుర్తి బస్టాండ్ ఆవరణ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే స్వయంగా నడిపి స్థానిక నాయకుల్లో ఉత్సాహం నింపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెలకు ఆర్టీసీ బస్సులు నడిపి ప్రజల సంక్షేమమే ఎజండాగా ముందుకు సాగుతామన్నారు.

నేడు ప్రారంభమైన బస్సు కల్వకుర్తి నుండి మార్చాల, జిల్లెల, గట్టుఇప్పలపల్లి,మెదక్ పల్లి,రాంపూర్,చంద్రధన మీదుగా తలకొండపల్లి చేరుకుంటుందని చెప్పారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికి 18 నెలలుగా ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికి చేరేవిదంగా చూసే భాద్యత గ్రామాలలోని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు,నాయకులదే అని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్,పిసిసి మెంబర్ శ్రీనివాస్ గౌడ్,యాట నర్సుంహ,డోకూరి ప్రభాకర్ రెడ్డి,రెన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,హరిమోహన్ రెడ్డి,మాజీ జడ్పీటీసిలు,ఎంపిటిసిలు,సర్పంచులు,పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజలుపాల్గొన్నారు.