20-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): దుర్గం చెరువు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన దుర్గం చెరువును శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సహదేవ్ కేశవ్ పాటిల్, జలమండలి, సీఈ, ఎస్ఎన్డీపీ ఈఈ, లేక్స్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ.. మురుగునీటి పైప్లైన్ను సరిగా, క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. పైప్ లైన్ మళ్లింపు పనులను వీలైనం త త్వరగా పూర్తి చేయాలన్నారు. సివరేజ్ లైన్ నిర్వహణ బాధ్యతను జలమండలి స్వతహాగా నిర్వహించి, చెరువుకు వచ్చే వాకర్స్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువును సుందరీక రణకు పార్కులో అవసరమైన వస్తువులను సమీకరించాలని, సీఎస్ఆర్ నిర్వహిస్తున్న వారికి సూచించారు. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించిన కమిషనర్.. వీటిని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వరరావు ఉన్నారు.
వీధి లైట్లపై ప్రత్యేక దృష్టి
నగరంలో వీధి దీపాల సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జీహెఎంసీ కమిష నర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలో అడిషనల్, జోనల్ కమిషనర్లు, హెవోడీలతో డి-సిల్టింగ్, శానిటేషన్, స్ట్రీట్ లైట్, దోమల నివారణ, టాక్స్ వసూళ్లపై నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్ట్రీట్ లైట్ సమస్యల విషయంలో తరచుగా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశించారు. మెన్, మెటీరియల్ ఏర్పాటుకు జోనల్ కమిషనర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
జోనల్, డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ ఇంజనీర్లు ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.