calender_icon.png 28 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతమంతా అన్యాయమే!

28-06-2025 01:16:05 AM

-కృష్ణా, గోదావరి నది జలాల పంపకంలో రైతులకు తీరని నష్టం 

-కమీషన్ల కక్కుర్తితో గత పాలకులు కాళేశ్వరం కడితే మూడేళ్లకే కూలిపోయింది  వచ్చాక తప్పిదాలను సరిచేస్తున్నాం..

-రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు 

- జాన్‌పహాడ్, బెట్టేతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన

సూర్యాపేట, జూన్ 27 (విజయక్రాం తి): గత పాలకుల కారణంగానే కృష్ణా, గోదావరి జలాల పంపకంలో తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని, దాని ని సరి చేసేందుకు ప్రస్తుత ప్రజాప్రభుత్వం పోరాడుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చె ప్పారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలం జాన్‌పహాడ్ గ్రామం లో కృష్ణానదిపై  నిర్మిస్తున్న జవహర్ జానపాడు లిఫ్ట్ ఇరిగేషన్, బెట్టేతండా గ్రామం లో మూసీనదిపై నిర్మిస్తున్న బెట్టేతండా స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గత పాలకుల పదేండ్ల నిర్లక్ష్యం కారణంగా కృష్ణానది లో 811టీఎంసీలలో  ఏపీకి 599, తెలంగాణకు 299టీఎంసీల రాతపూర్వక ఒప్పం దం కుదిరిందన్నారు. 

కానీ ప్రస్తుత ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక నది పరివాహక  ప్రాంతం, ఆయకట్టు, జనాభాను పరి గణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు  చేయాలని పోరాటం చేస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద రూ.38,000 కోట్లతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను ప్రారం భిస్తే, కమీషన్లకు కక్కుర్తి పడి లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మూడేళ్లకే కూలిపోయిందన్నారు.

అదే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే రూ. 62,000 కోట్లు మిగిలేవన్నారు. వాటితో ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూరు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదుల, సీతారామసాగర్, గౌరెల్లిలాంటి ప్రాజెక్టులు పూర్తయి నేడు తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదన్నారు. ఇరిగేషన్‌శాఖపై గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రస్తుతం రూ.16 వేలకోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు.

పాలమూరు రూ.27,500 కోట్లు, సీతారామ ప్రాజెక్ట్ రూ.10,000 కోట్లు ఖర్చు చేసినా ఒక ఎకరం కూడా కొత్తగా ఆయకట్టులోకి తీసుకొని రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి, తాను నీటిపారుదల శాఖలో జరిగిన తప్పిదాలను ఒక్కొకటిగా సరిచేసుకుంటూ కాళేశ్వరం నీరు ఇవ్వకున్నా తెలంగా ణలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో కలిపి 281 లక్షల టన్నుల వరి ధాన్యం పడిం చి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపామన్నారు.

జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధప్రాతిపదికన వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తిచే యాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు. పనులు చాలా నెమ్మదిగా జరుగు తున్నాయని ఇప్పటికే మూడు సార్లు సందర్శించిన పనుల్లో పురోగతి లేదని కాంట్రా క్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జాన్‌పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ స్కీంను రూ.302 కోట్లతో నిర్మిస్తు న్నామని,  దీని ద్వారా అలింగాపురం, రాఘవపురం, బొత్తలపాలెం, కోమటికుంట, మీగ డం పాడు తండా, చెరువు తండా, హనుమయగూడెం, పాలకీడు, సజ్జాపురం, నాగిరె డ్డిగూడెం గ్రామాల్లోని 10,000 ఎకరాలకు సాగునీరు, అలాగే జానపాడు చెరువుకు నీరు అందుతుందన్నారు.

ఆ తర్వాత రూ.33.83కోట్లతో నిర్మిస్తున్న బెట్టేతండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బెట్టేతండా, సజ్జా పురం, పాడ్యతండాల గిరిజన రైతులకు చెం దిన 2,041 ఎకరాలు ఆయకట్టు సాగులోకి  వస్తుందన్నారు. అలాగే మూసీనదిలో నీరు ఉండేలా రూ.10.50 కోట్లతో  చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ,  ఇరిగేషన్ సీఈ రమేశ్‌బాబు, ఎస్‌ఈ శివధర్మతేజ,ఆర్డీవో శ్రీనివాసులు, డీఈ నవీకాంత్, హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.