calender_icon.png 28 June, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎంలో దినదిన గండం ఊడిన పెచ్చులు

28-06-2025 01:19:30 AM

సర్జికల్ వార్డులో భయం భయం

- ముందుకు సాగని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు

వరంగల్, జూన్ 27 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణకు ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వైద్యం కోసం వచ్చేవారు దినదిన గండం గా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్ల క్రి తం నిర్మించిన భవనం కావడంతో ఎప్పు డు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. శుక్ర వారం ఎంజీఎం ఆసుపత్రిలోని పురుషుల సర్జికల్ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.

ఆ సమయంలో అక్కడ ఎవ రూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్క పురుషుల వార్డే కాదు ఎం జీఎం ఆస్పత్రిలోని పలు వార్డుల పైకప్పు లూ దెబ్బతిన్నాయి. ఇదే వార్డులో ఇటీవల టాయిలెట్లలో పైకప్పు పెచ్చులూడి పడిపోవడంతో కొందరు గాయపడ్డారు. ప్రతీ వర్షాకాలంలో ఇదే తరహాలో ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సెంట్రల్ జైలును తొల గించి కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల ఎంజీఎం ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనపై అధికారులు చిన్నచూపు చూ స్తున్నారని రోగులు, ప్రజలు ఆరోపిస్తున్నా రు. కొత్త ఆసుపత్రి నిర్మించేంతవరకు ఇలాం టి ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతే బాధ్యు లు ఎవరని ప్రశ్నిస్తున్నారు. 

హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడో?

వరంగల్ నగరంలోని సెంట్రల్ జైలు స్థానంలో 15 ఎకరాల స్థలంలో కొత్తగా 24 అంతస్తులతో 800 సూపర్ స్పెషాలిటీ బెడ్లతో పాటు సుమారు 2,000 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. తొలుత రూ.1,100 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రారంభించగా ఇప్పుడు అంచనా వ్యయం రూ.1,700 కోట్లకు పైగా పెరిగింది.

2026నాటకి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న పనులు నిరాశాజనకంగా ఉ న్నాయి. నిర్మాణ పనులతో పాటు, నిధుల సమీకరణపై, అంచనా వ్యయం పెంపుపై అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం వరకు పను లు పూర్తయినట్టు చెబుతున్నప్పటికీ ఆసుప త్రి నిర్మాణం పూర్తి కావడం ఇప్పట్లో అయ్యే పని కాదనే విమర్శలు వస్తున్నాయి.