18 April, 2026 | 2:21 AM

పెండింగ్ పీఆర్సీ విడుదల చేయాలి

18-04-2026 12:38 AM

కొల్లాపూర్ టౌన్ , ఏప్రిల్ 17: ఉద్యోగుల పెండింగ్ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జీకే వెంకటేష్ మాట్లాడుతూ 2023 నుంచి పీఆర్సీ పెండింగ్లో ఉందని, టీఏలు పెరుగుతున్నప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో బాన్సులాల్కు వినతిపత్రం అందజేశారు.