14-06-2025 07:08:11 PM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మంచినీటి సరఫరా పైపులైన్ల నిర్మాణం కోసం మిషన్ భగీరథ ద్వారా చేసిన గుంటలను వెంటనే పూడ్చాలని, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు(Former Director of State MarkFed Kotwala Srinivasa Rao) అన్నారు. శనివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పూడ్చని గుంటలను, అపరిశుభ్రంతో పేరుకుపోయిన మురికి కాలవలను కొత్వాలకు చూపించారు. స్పందించిన ఆయన వెంటనే మున్సిపల్ అధికారులు దృష్టికి సమస్యలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణాలు చాలా ప్రాంతాల్లో అసంపూర్తిగానే ఉన్నాయన్నారు.
గుంతలను యుద్ద ప్రాతిపదికపై పుడ్పించాలని, అసంపూర్తిగా మిగిలిన పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో గాయపడిన వెంగళరావు కాలనీ వాసి గుగులోతు బాలు నాయక్ ను ఈ సందర్భంగా కొత్వాల పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీ చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతి వర్ధన్, సందు ప్రభాకర్, కాపర్తి వెంకటాచారి, దారా చిరంజీవి, పులి సత్యనారాయణ, వాసు మల్ల సుందర్రావు, సాంబయ్య, అరిగే గోపికృష్ణ, గుగులోతు నందిని, జర్పుల లింగ్యా తదితరులు పాల్గొన్నారు.