calender_icon.png 13 June, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవాసీల సహవాస శక్తి!

08-01-2025 12:00:00 AM

విశ్వవ్యాప్తంగా గొప్పవారి ‘జయంతులు’ , ‘వర్ధంతులు’ జర పడం ఆనవాయితీ. ఎందుకంటే వారు చేసిన కృషిని, త్యాగాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆచరించాలనే ఒక మం చి సంకల్పమే దానికి కారణం. అలాగే ఒక మంచి ‘సందర్భాన్ని’కూడా ఒక ప్రత్యేక ది నంగా జరపడం వల్ల కూడా ఆ సంఘటనకు ప్రాధాన్యత కల్పిస్తూ దానికి సంబం ధించిన కార్యక్రమం నిర్వహించడం కూడా ఆనవాయితీగా మారింది.

జనవరి 9కి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. 1915 వ  సంవత్సరం,జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 9 ని ‘ప్రవాసీ భారతీయ దివస్’గా జరుపుకుంటున్నాం.  2003 నుండి భారతప్రభుత్వం దీన్ని ఘనంగా నిర్వహిస్తోంది. 

మనదే అగ్రస్థానం

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ‘ప్రవాస భారతీయులు’ అని అంటారు. ఇంగ్లీషులో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) అనీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండి యన్ ఆరిజిన్ (పిఐఓ) అనీ కూడా పిలుస్తారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెలు పల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్న వారని అర్థం.

విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్ర కారం 3.3 కోట్ల ప్రవాస భారతీయులు ఉ న్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస జ నాభాలో 5.5 కోట్ల మందిలో భారతీయ మూలాలున్నవారే అత్యధికులు. ప్రపంచంలో 150 కి పైగా  దేశాల్లో మనవారు ఉన్నారు.

1980 వ సంవత్సరం తర్వాత నుండి సాఫ్ట్‌వేర్ రంగం అనూహ్యంగా పైకెగసిం ది.  అమెరికాలో జరిగిన ఆర్థికాభివద్ది చా లా మంది భారతీయులను ఆకర్షించింది. అట్లే అరబ్ దేశాల్లో పెట్రోలియం నిల్వలు బయల్పడడం, మరిన్ని దేశాలు ఆర్థికాభివద్ధిని సాధించడం వల్ల అనేక మంది భారతీ యులు ఆయా దేశాలకు వలస వెళ్లారు. వి విధ కారణాల వల్ల ఇలా వలస వెళ్లిన వా రు, ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంత తి వారు అందరూ కలిసి దాదాపు 33 మి లియన్ల వరకూ వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.

ప్రస్తుతం వారిలో చాలా మంది భారతీయులను ఈ దేశ అభివద్ధిలో భాగస్వాము లుగా చేసి మన దేశాభివద్ధి కి వారిని ఉపయోగించుకోవాల్సిన అవసర ఉంది. ప్ర వాస భారతీయులు వివిధ దేశాల్లో, వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. కొందరు ఆ యా దేశాల్లో కీలకమైన పదవులు నిర్వహి స్తూ ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. వారి నైపుణ్యాలు, సేవలు భారత దేశపౌరులకు కూ డా ఉపయోగపడేలా చూసుకోవాలి.

అందుకు తగిన పరిస్థితులను కల్పించి, వారి కృషి ఫలితాన్ని మనం పొందగలిగేలా చూ డాలి. ప్రవాసీలు వారికి అనువైన సమయంలో, వారికి అనువైన రీతిలో మనకు సేవలందించేటందుకు వారిని మనం ఎ ల్లా వేళలా ఆహ్వానించవలసి ఉంది.

వీరందరి కోసం నిర్దిష్టమైన ప్రణాళికలు రూ పొందించి మన అవసరాలు, మన యువతకు వారి నుండి కావాల్సిన తోడ్పాటు గు రించి అవగాహన కల్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన దేశంలో సామాజిక, విద్య , వైద్య, , మౌలిక సౌకర్యాలు మెరుగు పడతాయి. ఆర్థికంగా కూడా దేశం అభివద్ధి చెందే అవకాశం ఉంది.

ప్రతి రెండేళ్లకోసారి..

2015 నుండి, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారతీయ ‘ప్రవాసీ భారతీయ దివస్’ జరుపుకోవడానికి, విదేశీ డయాస్పోరా నిపుణులు, విధాన రూపకర్తలు,  వాటాదారుల భాగస్వామ్యం తో  థీమ్- ఆధారిత  సమావేశాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావే శాలు విదేశీ భారతీయ కమ్యూనిటీకి పరస్పర ప్రయోజనకరమైన కార్యకలా పాల కోసం తమ పూర్వీకుల భూమిలోని ప్రభుత్వం,  ప్రజలతో మమేకం కావడానికి ఒక వేదికను అందిస్తాయి.

ఈ సమావేశా లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న విదేశీ భారతీయ కమ్యూనిటీ మధ్య నెట్‌వర్కింగ్‌లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే వివిధ రంగాలలో వారి అనుభవాలను పంచుకోవడానికి వీ లు కల్పిస్తాయి. ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. విదేశీ ప్రవాసులతో పరస్ప రం చర్చలు జరపడానికి, వారికి తగిన ప్రో త్సాహం అందించడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోంది.

2021లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత్ కు తోడ్పడటం’ అనే ఇతివత్తాన్ని జోడించారు. 2023 జనవరి 8 నుండి 10 వరకు ఇండోర్‌లో జరిగిన 17వ  కన్వెన్షన్ ‘అమృత్ కాల్‌లో భారతదేశ పురోగతికి విశ్వసనీయ భాగస్వాములు’అనే థీమ్‌పై జరిగింది. ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ నెల 8నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

 భువనేశ్వర్‌లో జరిగే 18వ ప్రవాసీ భా రతీయ దివస్ సదస్సుకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈసారి సదస్సు థీమ్ ‘వికసిత్ భారత్‌కు డయాస్పోరా సహకారం’గా నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ , రాష్ర్ట ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

రాష్ర్టపతి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదా నం చేయనున్నారు. ఇంతకు ముందు ఈ సదస్సులు దేశంలోని న్యూఢిల్లీ,ముంబై, హైదరాబాద్, చెన్నై, జైపూర్,కొచ్చి, గాంధీనగర్, బెంగళూరు, వారణాసి తదితర నగరాల్లో  జరగగా ఇప్పుడు భువనేశ్వర్‌లో జరగనుంది.

భారత దేశ ప్రచారకర్తలు

ప్రవాస భారతీయుల నైపుణ్యాలు, సేవ లు భారత దేశం వచ్చేలా ప్రోత్సహిస్తూ, అందుకు తగ్గ పరిస్థితులను మనం  కల్పించాలి. అప్పుడే విదేశాల్లోని మనవారి కృషి ఫలితాన్ని మనపౌరులందరూ పొందగలరు. అందుకని, వారికి కావాల్సిన అంశా లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భారతదేశ అభివద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే మనం ప్రతి సంవత్సరం ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ జరుపుకుంటున్నామని గుర్తుంచుకోవాలి.

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగ డరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ ఖండాంతరాలు దాటిన భారతీయులందరూ ఏకమై.. భారతీయ సాంస్కృతిక సం ప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ప్రతియేటా ఎన్నో సాంస్కతిక కార్యక్రమాలు చేసుకుం టూ, భావితరాలు గుర్తుంచుకునేలా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. సొంతప్రాంత అభివృద్ధికి చాలా మంది ప్రవాసీలు తోడ్పడుతున్నారు.

ఉపాధి కోసం కొందరు, ఉ ద్యోగాల కోసం మరికొందరు, విజ్ఞాన స ముపార్జన కోసం ఇంకొందరు విదేశాల్లో  ఉండి, మాతృభూమి అభివద్ధి కోరుకున్న భారతీయులెందరో ఉన్నారు. పుట్టినగడ్డపై ఉన్న మమకారంతో ప్రవాస భారతీయులెందరో స్వస్థలంలో చేపడుతున్న అభివృ ద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఇక ఉద్యోగాల కోసం అమెరికా మొదలుకుని జర్మ నీ, స్విట్జర్లాండ్,జపాన్, రష్యా,యూకే.. ఇ లా ఒక్కటేమిటి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు.

ఎక్కడికి వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును పొందటంలో భారరతీయులకు సాటి మరెవరూ లేరం టూ ప్రవాస భారతీయులు నిరూపించుకున్నారు. విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా సుసం పన్నమైనవారు ఎన్‌ఆర్‌ఐ బృందాలుగా ఏ ర్పడి వారు పుట్టి పెరిగిన గ్రామాలకే కాదు జిల్లా స్థాయిలో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నవారు ఎందరోఉ న్నారు.

మన భారతీయులు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మ నస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక ప్రవాసీలు భారత్‌కు చెందిన వా రే. ఏపీ, తెలంగాణకు చెందిన ప్రవాసీలు ప్రత్యేకంగా తెలుగు సంఘాలుగా ఏర్పడి మనప్రాంత అభివద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. ప్రవాసీ భారతీయులను భారతదేశ ప్రచారకర్తలుగా, భారత దేశగొప్పతనాన్ని నలుదిశల్లో చాటిచెప్పిన గొప్ప వారిగా మనం గుర్తిస్తూ గౌరవిద్దాం.

 వ్యాసకర్త సెల్: 9963499282