09-01-2025 12:00:00 AM
అనూహ్య పరిణామాల మధ్య పదవి కోల్పోయి గత ఆగస్టునుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. మూకుమ్మడి హ త్యలతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసీనాను విచారించ డం కోసం తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే భారత ప్రభుత్వానికి సందేశం పంపింది.
కానీ భారత్ స్పందించకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఆమె అరెస్టుకు వారెంట్ జారీ చేయడంతో పాటు పాస్పోర్టును కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హసీనా వీసా గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హసీనాకు శరణార్థిగా శాశ్వతంగా రాజకీయ ఆశ్రయం కల్పించనున్నారం టూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిజానికి భారత్లో శరణార్థులకు సంబంధించి ప్రత్యేక చట్టం ఏదీ లేదు.
అంతేకాదు శరణార్థులకు సంబంధించి 1951నాటి ఐక్యరాజ్య సమి తి ఒడంబడికపై మన దేశం సంతకం చేయలేదు. అయినప్పటికీ కొన్ని ప్ర త్యేక పరిస్థితుల్లో కొంతమందికి మన దేశం శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. 1980లో టిబెట్నుంచి పారిపోయి వచ్చిన వేలాదిమందికి మన దేశం ఆశ్రయం కల్పించింది. అలాగే శ్రీలంకలో అంతర్యుద్ధం సమయంలో అక్కడినుంచి పారిపోయి వచ్చిన తమిళులు తమిళనాడులోని అ నేక ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు.
వీరందరికీ మనదేశం శరణార్థులుగా గుర్తింపు ఇచ్చింది. టిబెట్నుంచి పారిపోయి వచ్చిన బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ధర్మస్థల కేంద్రంగా 1960నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం కల్పించిం ది కూడా. అయితే షేక్ హసీనాకు అలా రాజకీయ ఆశ్రయం కల్పించడానికి బంగ్లాతో మనకున్న సంబంధాలు పెద్ద అడ్డంకిగా మారుతు న్నాయి.
హసీనా తండ్రి ముజిబుర్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటుకు మన దేశం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ప్రత్యేక దేశం ఏర్పా టుకు మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాకు పారిపోయి అక్కడినుం చి కార్యకలాపాలు సాగిస్తూ వచ్చి న తిరుగుబాటు మఠాలను అణచివేయడంలో హసీనా ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించింది.
ఇక బంగ్లాదేశ్లో ముస్లింల తర్వాత హిందువులే అధికం. అన్ని రంగాల్లోను ఇరుదేశాల మధ్య సుదీర్ఘ మైత్రి కొనసాగుతోం ది. అన్నిటికీ మించి బంగ్ల్లాతో మన దేశానికి 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇరుదేశాల మధ్య రైలు సర్వీసులు, నదీ జలాల పంపిణీ ఒప్పందం కూడా ఉంది. ఇంత విడదీయలేని అనుబంధం ఉన్న బంగ్లాదేశ్తో సత్సంబంధాలను కలిగి ఉండడం మన దేశానికి చాలా ముఖ్యం.
అంతేకాదు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం. ఈ ఏడాది చివర్లో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మాత్రమే హసీనా విషయంలో ఆ ప్ర భుత్వం వైఖరి ఎలా ఉండనుందో స్పష్టమవుతుంది. అప్పటిదాకా వేచి ఉండాలనేది భారత ప్రభుత్వం యోచనగా కనిపిస్తోంది. అందుకే అక్కడ హిందువులపైన, ప్రార్థనా మందిరాలపైన మత ఛాందసవాదులు దాడు లు చేస్తున్నా కేంద్రం కఠినంగా వ్యవహరించడం లేదు.
అలాగే ఇస్కాన్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు విషయంలోను హిందుత్వ సంస్థల నుంచి పెద్దగా ఒత్తిడి ఉన్నా సంయమనం పాటిస్తూ వచ్చింది. ఇప్పుడు హసీనాకు ఆశ్రయం విషయంలో కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది. అధికారికంగా రాజకీయ ఆశ్రయం కల్పించనప్పటికీ వీసా పొడిగించడం ద్వారా ఆమె భారత్లోనే మరికొంతకాలం ఉంటారని బంగ్లాకు చెప్పకనే చెప్పిందని అంటున్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు.