calender_icon.png 27 October, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

27-10-2025 05:54:47 PM

నకిరేకల్ (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కందాల పాపిరెడ్డి కోరారు. సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల  పెండింగు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి వీరమల్ల రవీందర్, కోశాధికారి చిక్కు రవీందర్, సహా అధ్యక్షుడు పోతుల రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు పోతుల వెంకటనారాయణ, సహకార దర్శి బిక్షం రెడ్డి, మహిళా ప్రతినిధులు ఉత్తరమ్మ, రమణా రామ్, తదితరులు ఉన్నారు.