5 May, 2026 | 8:18 PM

Breaking News

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •   ఏరియా పర్సనల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి   •  

ఆరో తోడేలునూ చంపేశారు

07-10-2024 12:29 AM

బహరాయిచ్, అక్టోబర్ 6: యూపీలోని బహరాయిచ్ జిల్లాను వణికిస్తున్న ఆరో తోడేలును గ్రామస్థులు మట్టుబెట్టారు. శనివారం తమాచ్ పుర్ గ్రామంలో మేకను వేటాడేందుకు వచ్చిన తోడేలును గ్రామస్థు లు కొట్టి చంపినట్లు అధికారులు పేర్కొన్నారు. మహసి ప్రాంతంలో మార్చి నుంచి తోడేళ్లు వరుసగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో  ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు.

మొత్తం ఆరు తోడేళ్ల గుంపు సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారు లు వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియాను ప్రారంభించారు. ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయం తో నిఘావేశారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలను మార్చుకుంటూ వచ్చాయి.

దీంతో తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాకుంటే వాటిని కాల్చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఐదో తోడేళ్లను గత నెల 10వ తేదీన అధికారులు బంధించారు. చివరి తోడేలును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా తాజాగా అది మృతి చెందింది.