calender_icon.png 17 June, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు

12-06-2025 12:33:50 AM

ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి 

సిద్దిపేట, జూన్ 11(విజయక్రాంతి):  రాష్ట్రంలో అధికారం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణ కలిగి లేదని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాల అందించడం లేదని విమర్శించారు. భారతదేశంలో పుట్టిన ప్రతివారు దేశం పౌరులేనని అందరూ భారత మాత కి జై అనాల్సిందేనని చెప్పారు. 11 ఏళ్ల మోడీ పాలన దేశాన్ని రక్షణ భాండాగారంగా, ఆర్థికంగా, సైన్స్ పరంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. భద్రతలో దేశం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి చెల్లించిన పన్నులను కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సమభాగంగానే అభివృద్ధి నిధులు విడుదల చేస్తుందన్నారు. అవగాహన లేని తనంతో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిందని ఈ విషయాన్ని గ్రహించని కొన్ని పార్టీల నాయకులు హిస్టారీతిగా మాట్లాడుతున్నారని తెలిపారు.

వికాస్ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, మోడీ పరిపాలన విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వంగ రామచంద్ర రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా, పట్టణ అధ్యక్షులు బాసంగారి వెంకట్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.