12-06-2025 12:33:52 AM
చేవెళ్ల , జూన్ 11 : మామిడి తోటలో గడ్డిని తొలగింస్తుండగా ట్రాక్టర్ రోటావేటర్ కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. చేవెళ్ల ఎస్ఐ శిరీష తెలిపిన కథనం ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధి రాజీవ్ కాలనీకి చెందిన మంగళి సంజీవ్ కుమార్ (34) బార్బర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
మంగళవారం సంజీవ్ కుమార్ భార్య అక్క అయిన పద్మ నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. బుధవారం ఉదయ 9 గంటల సమయంలో పద్మ వాళ్ల ఫాంహౌస్లోని మామిడి తోటలో భర్త సుశీల్ కుమార్ ట్రాక్టర్ రోటావేటర్తో గడ్డిని తొలగిస్తుండగా అక్కడే ఆడుకుంటున్న సంజీవ్ కుమార్ కూతురు అక్షిత (11) ప్రమాదవశాత్తు రోటావేటర్లో ఇరుక్కుపోయింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుఎస్ఐతెలిపారు.