పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి): డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. డివిజన్ అభివృద్ధిలో భాగంగా గతంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిధులు 1 కోటి రూపాయలతో చేపట్టిన రూ.9 లక్షల నిధులతో ప్రారంభించిన అరుంధతి నగర్ బస్తీ కమిటీ హాల్, చిక్కడపల్లి బాపునగర్ బాపునగర్ యూత్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ రెన్నొవేషన్ పనులను శుక్రవారం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బీజేపీ నాయకులతో కలసి పనులను పరిశీలించారు.
కమ్యూనిటీ మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి వచ్చే విధంగా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఎం. ఉమేష్, ఆనంద్ రావు, సాయి గౌడ్, బస్తీ నాయకులు రాజు, రేవంత్, ఉదయ్, సాయి తేజ, క్రాంతి, భాగ్య, లావణ్య పాల్గొన్నారు.






