13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కిలిమంజారోపై త్రివర్ణ పతాకం

09-01-2026 01:04 AM

సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరుదైన ఘనత

మణికొండ, జనవరి 8, (విజయక్రాంతి): సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఆకాశమే హద్దని నిరూపించారు నార్సింగికి చెందిన పలమడ హితేష్. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూనే పర్వతారోహణపై ఉన్న మక్కువతో ప్రపంచంలోనే నాలుగో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. మాజీ వైమానిక దళ ఉద్యోగి పలమడ రమణ కుమారుడైన హితేష్ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన దేశభక్తి, క్రమశిక్షణతో ఈ సాహసానికి పూనుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఆఫ్రికా ఖండంలోని అత్యున్నత శిఖరంపై అడుగుపెట్టి భారత జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేసి దేశ ఖ్యాతిని చాటారు.