17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఓడేడు మానేరులో ఉనుక లారీ బోల్తా

20-04-2025 10:21 PM

ముత్తారం (విజయక్రాంతి): భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లా సరిహద్దులోని ముత్తారం మండలంలోని ఓడేడు-గరిమెళ్ళపళ్లి మానేరు వాగులో ప్రమాదవశత్తు ఆదివారం ఉదయం ఉనుక లారీ బొల్తపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు క్లీనర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద పెనుప్రమాదం తప్పింది. గత మూడు నెలల క్రితం మానేరు వాగులో ప్రయాణికుల సౌకర్యార్థం మట్టి రోడ్డు ఏర్పాటు చేయగా, ఆ మట్టి రోడ్డుపై కేవలం ద్విచక్ర వాహనాలు కార్లు ప్రయాణించాల్సి ఉండగా పెద్ద వాహనాలు లారీలు ఇసుకతో కంకరతో, ఇటుక లోడుతో లారీలు, ట్రాక్టర్లు ప్రయాణిస్తుండడంతో ఈ  ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాస్తూ లారీ బోల్తా పడినప్పుడు ఎవరైనా ప్రయాణికులు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మానేరు మట్టి రోడ్డుపై పెద్ద వాహనాలను ప్రయాణించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.