calender_icon.png 25 June, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది పాలన సంతృప్తినిచ్చింది

25-06-2025 12:44:57 AM

  1. ఆలమూరు అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తున్నాం
  2. విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ 

మహబూబ్ నగర్ జూన్ 24 (విజయ క్రాంతి) : గడిచిన ఏడాది కాలం పాటు చేసిన పరిపాలన చాలా సంతృప్తిని ఇచ్చిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏడాదిలో పాలమూరు ఎంపీగా సాధించిన విజయాలు, తీసుకొచ్చిన, ఖర్చు చేసిన నిధులు, చేసిన అభివృద్ధి పనులపై ప్రత్యేక పుస్తకావిష్కరణ చేశారు. ఇప్పటి వరకు రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. జడ్చర్ల నుంచి రాయచుర్ రోడ్ 4 లేన్లుగా చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని, ఎన్ హెచ్- 44 కూడా 6 లైన్ల రోడ్డును అప్గ్రేడ్ జరిగిందని స్పష్టం చేశారు.

కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్రం మంత్రి గడ్కరి ప్రారంభించారని, నారాయణపేట మీదుగా ఎన్ హెచ్-167 కర్ణాటక వరకు వెళ్లే రోడ్డు 4 లెన్స్ గా అభివృద్ది చేయబోతున్నామని తెలియజేశారు. అమృత్ స్టేషన్ల లలో భాగంగా పార్లమెంట్ లోని 39.87 కోట్లతో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్,, మరో 10.94 కోట్లతో జడ్చర్ల, రూ. 9.59 కోట్లతో షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయన్నారు.

కృష్ణా - వికారాబాద్ రైవే లైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే 167 కు అనుసంధానంగా బైపాస్ రోడ్డుకు కేంద్రం అంగీకారించిందని తెలియజేశారు. ఇవే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులుఉన్నారు.