calender_icon.png 25 June, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రజల సమగ్ర అభివృద్ధే మోదీ లక్ష్యం

25-06-2025 12:46:10 AM

నిజామాబాద్ జూన్ 24: (విజయ క్రాంతి): దేశంలోని అన్ని రంగాల తో పాటు వివిధ ప్రాంతాల ప్రజల యొక్క సర్వతో ముఖాభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నదని నిజామా బాద్ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు రానున్న రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు నిరంతర కృషి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పట్టిందన్నారు. 

బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిజామాబాద్ రూరల్ మండల్ మల్లారం గ్రామం ప్రజలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారుసేవ ,సుపరిపాలన, పేదల సంక్షేమనికి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రధానమంత్రి గారి కళ్యాణ్ యువజన ద్వారా ఉచిత రేషన్,

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4కోట్లకు పైగా ఇల్లు నిర్మాణం,15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ఘర్ ఘర్ జల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు, రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా ప్రజలకి అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారత ప్రజలందరూ తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్టు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.

బీజేపీ గ్రామం నాయకులు మాజీ ఉపసర్పంచ్ చికోటి రవి, సొసైటీ డైరెక్టర్ గోపి, బొల్లం గంగాధర్,దశరథ, మోహన్, గంగాధర్, రాజకుమార్ ఓబీసీ ఐటీ సెల్,మరియు ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.