గజేంద్రుడికి ఉపశమనం..!

26-04-2024 02:09:16 AM

ఎండవేడిమికి ప్రజలే కాదు మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా జంతు ప్రదర్శన శాలల్లో వేడి తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. అందుకే జంతు పర్యవేక్షకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గురువారం ముంబైలోని వీరమాత జీజాబాయి బొటానికల్ గార్డెన్, జూలో ఓ ఏనుగుపై నీళ్లు చల్లుతూ ఉపశమనం కలిగిస్తున్నాడో జూకీపర్.