శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో చోరీ
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో సంఘటన
అబ్దుల్లాపూర్మెట్,మే 15: శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మె ట్ మండలం బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంది. సజ్జల భూషన్ ఆలయలో పూజారి పనిచేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం 6:30 గంటలకు పూజ పూర్తి చేసి.. ఆలయానికి తాళం చేసి అతను ఇంటి వెళ్లాడు. గురువారం తెల్లవారుజాము న ఇదే గ్రామానికి చెందిన మెరుగు నర్సిం హా ఆయల తలుపులు తెరిచి ఉండడం గమనించి.. పూజారికి ఫోన్ చేసి దేవాలయం తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం ఇచ్చాడు.
వెంటనే స్పందించి పూజారి ఆలయం వద్ద వచ్చి.. ఆలయంలోకి వెళ్లి చూడగా.. దేవత బంగారు నూపిటల్, నూపిటల్ దారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు కనపించకపోవడంతో.. చోరీకి గురైనట్లు గమనించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్లో పూజారి భూషన్ ఫిర్యాదు చేశాడు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపారు.






