calender_icon.png 30 June, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాలతో మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు

30-06-2025 01:31:07 AM

  1. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు.
  2. జూరాల ప్రాజెక్టు పై నిజాలే చెప్పాను .....
  3. మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి..
  4. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి

గద్వాల, జూన్ 29 ( విజయక్రాంతి ) : ర్యాలంపాడు రిజర్వాయర్ పై ఇంకెన్ని రోజు లు అబద్దాలు చెప్తారని మసిపూసి మారేడు కాయ చేసి అది చేస్తాం, ఇది చేస్తామంటూ రోజుకో అబద్దం చెబుతున్నారని కాంగ్రెస్ ప్ర భుత్వంపై గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహ్మరెడ్డి ఆరోపించారు. ఆదివారం జూ రాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ లను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ర్యాలంపాడు స్టోరేజ్, లీకేజీలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 2 టీఎంసీలతో ర్యాలంపాడు రిజర్వాయర్ ను నిర్మాణానికి డిజైన్ చేశారని, నీటి సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 4, టీం ఎంసీలకు పెంచడం వల్లే రిజర్వాయర్ కు సమస్యతలెత్తిందన్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు బుంగలు ఏర్పడి యేండ్లు కావొస్తుందని, ప్రభుత్వాలు లీకేజీ మరమ్మతులకు కమిటీలతో కాలయాపన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

అప్పటి ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు తప్పిదాల వల్లే ర్యాలంపాడు రిజర్వాయర్ 2టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచి రిజర్వాయర్ భద్రతకు ముప్పువాటిలిందన్నారు. దీంతో రిజ ర్వాయర్కు ఏర్పడ్డ లీకేజీల కారణంగా పూర్తిస్థాయిలో నీటిని నింపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గట్టు లిఫ్ట్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ర్యాలంపాడు రిజర్వాయర్ కు రిపేర్లు చేస్తామని చెప్పిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మళ్లీ ఆరు నెలల తర్వాత వచ్చి మళ్లీ ఉత్త మాటలు చెప్పి రిపేర్లు చేస్తామం టూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.

ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మా ణం కేవలం రెండు టీఎంసీలకు డిజైన్ చేయబడింది అనే విషయాన్ని గుర్తుంచుకోవా లన్నారు. ఇప్పుడు నాలుగు టీఎంసీల నీళ్లు ఆపాలన్నా, బుంగలు రిపేర్లు జరగాలన్న బండ్ మార్చాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై గతంలోనే తాము ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ అప్పటి నుంచి మురళీధర్ రావు బిల్లులు చె ల్లించడం జరిగిందన్నారు.

ఇప్పుడు జరిగే అన్ని పరిణామాలపై గతంలోనే తాము స్ప ష్టంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 300 పేజీల నివేదిక తమ దగ్గర ఉన్నదని ఇందులో ఏ ఒక్కటి అబద్ధమాన్ని తీర్చిన తా ము రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నా రు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ చేయాలని డిమాం డ్ చేశారు. రిజర్వాయర్ లీకేజీల మరమ్మతుకు పుణె కమిటీతో పరిష్కారం దొరుకు తుందని ప్రభుత్వం భావించిన నేటికి నిరాశగా మారిందని అన్నారు.

నెట్టంపాడు ఎత్తిపోతల పథకానికి గుండెకాయలాంటి ర్యాలంపాడు రిజర్యాయర్ లీకే జీలను అరికట్టేందుకు ప్రభుత్వ అనుభవజ్ఞులైన నిపుణుక కమిటితో నివేధిక తయారు చేసి మరమ్మతులు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీలు పెంచాలంటే మరో సారి రిజర్వాయర్ ను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా గట్టు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు రిజర్వాయరే ఆధారం కాబట్టి రిజర్వాయర్ ను పటి ష్టం చేయాలన్నారు.

 జూరాల ప్రాజెక్టు పై నిజాలే చెప్పాను 

జూరాల ప్రాజెక్టుపై ముమ్మాటికి తాను మొత్తం నిజాలే మాట్లాడడం జరిగిందని, ఎవరిని భయభ్రాంతులకు గురి చేసేందుకు మాట్లాడలేదని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లిఫ్టులు పనిచేయకపోయినా షిల్ట్ ను తొలగించామని చెప్పడం వారికే చెల్లుతుందన్నారు. స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎ లాంటి పనులు చేయకుండానే ఏటా నాలు గు కోట్లు ఇస్తున్నది వాస్తవం కాదా అనే విషయాన్ని ఆఫీసర్లు, అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయాలన్నారు.

రోప్ లు తెగిపోయి నాలుగు గేట్లు ద్వారా నీళ్లు కూడా వదిలేయని పరిస్థితి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్రరెడ్డి, సంజీవ్ భరద్వాజ్, కృష్ణం రాజు, రఘు గౌడ్ ఉన్నారు.