calender_icon.png 26 June, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు వరం సన్న బియ్యం

11-06-2025 12:21:25 AM

- రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్న లబ్ధిదారులు 

- ఆర్థిక భారం తప్పిదంటున్న వైనం 

- ప్రైవేట్ బియ్యం షాపులకు సన్నబియ్యం బ్రేక్ 

- అయోమయంలో దళారులు 

- లబ్ధిదారుల ఇళ్లల్లో నేతల,అధికారులు భోజనాలు 

వనపర్తి, జూన్ 10 ( విజయక్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స న్నబియ్యం పంపిణి పై పేదల హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నెల 1 వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణి ప్రారంభీంచగా లబ్ధిదారులు దుకాణాల ముందు బారులు తీరి మరి తీసుకుని వెళ్ళుతున్నారు.

దొడ్డు బియ్యం పంపిణి సమయంలో నెల చివరి వరకు కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులు ఈ నెల లోనే దాదా పు అందరు తీసుకొని వెళ్లడం జరిగిందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. సన్న బియ్యం కొనుగోలు చేయనటువంటి తమకు సన్న బియ్యం తో రుచికరమైన భోజనం అందుతుందని మెజారిటీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 ప్రవేట్ బియ్యం షాపులకు సన్నబియ్యం బ్రేక్ 

ఎప్పుడు జనంతో సందడిగా కనిపించే ప్రైవేట్ రైస్ షాపుల వద్ద సామాన్య ప్రజల రద్దీ తగ్గి కొనుగోళ్లు మందగించాయి. బి య్యం దుకాణాలముందుకు ఎవరైనా వెళ్లితే తాము నాణ్యమైన బియ్యం అందుబాటులోని ధరలకే విక్రయిస్తున్నామని వ్యాపార స్తులు గొప్పలుచెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇష్టానుసారంగా సన్నబియ్యం అమ్మకం చేసిన వ్యాపారులకు సన్నబియ్యం పథకం కాస్తా వారి అక్రమ ఆదాయానికి గండి కొట్టిందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు 

 అయోమయంలో దళారులు 

గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం(పీడీఎస్ రైస్) తో పెద్ద మొత్తంలోవ్యాపారం చేసిన దళారులు అయోమయం లో పడ్డారు. మార్చి నెలాఖరు దాకా పేదల కు ప్రభుత్వం పంపిణీ చేసే దొడ్డుబియ్యం కిలో రూ.10 వరకు కొనుగోలు చేసి కొన్ని రైస్ మిల్లులకు, ఇతర రాష్ట్రాలకు కిలోకు రూ. 25లకు అమ్మేవారు. రాజకీయ అండదండలతో కొంత మంది రేషన్డీలర్లు చేస్తున్న          దందా ఒక్కసారిగా గండి పడండంతో దీనితో ఏం చేయాలో అర్థం పరిస్థితులు నెలకొన్నాయి. 

 లబ్ధిదారుల ఇళ్లల్లో నేతల, అధికారుల భోజనాలు 

రాష్ట్ర సర్కార్ అట్టహాసంగా సన్నబియ్యం పథకం ప్రారంభించింది. పథకం యొక్క ప్రధాన లక్ష్యం చేరువలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో గత నెలలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల నివాస గృహలకు వెళ్లి వారితో కలిసి భోజనం చేసారు

 సన్నబియ్యం పథకం ప్రారంభం శుభసూచకం: గంధం రాణి, రేషన్ షాపు డీలర్లు, పెబ్బేరు

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభం ఒక శుభసూచ కం. గతంలో దొడ్డు బియ్యం వస్తున్నప్పుడు ప్రజలు మందకొడిగా తీసుకునే వారు. కొంత అసంతృప్తి కనిపించేది. ప్రస్తుతం స న్నబియ్యం కారణంగా ప్రజలు ఉత్సాహంగా, వేగంగా తీసుకుంటున్నారు. కార ణం వారి కుటుంబం తింటున్నారు కాబట్టి. బియ్యం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి.

సన్న బియ్యం పంపిణి చాలా సంతోషంగా ఉంది కటికల చంద్ర కళ, పెబ్బేరు

గతంలో బియ్యం తినడానికి ఉపయోగపడేవి కాదు. కానీ దోశలు తదితర టిఫిన్ ల కోసం వాడే వారం. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం తినడానికి ఉపయోగ పడుతున్నాయి. నిజంగా సంతోషంగా ఉంది. బియ్యం బాగానే ఉన్నాయి. ఇంకా క్వాలిటీ పెరిగితే బాగుంటుంది.